అమరావతి : కాపు ఉద్యమ నేత , మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ( Mudragada Padmanabham) జనసేన అధినేత పవన్కల్యాణ్ వ్యాఖ్యలపై (Pawankalyan) పై విరుచుకుపడ్డారు. హైదరాబాద్లో పుట్టిన పవన్ పిఠాపురం వచ్చి ఎమ్మెల్యే కావాలని అనుకోవడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. మగాడు అయితే పవన్కల్యాణ్ తనపై నేరుగా విమర్శలు చేయవచ్చని సూచించారు.
సీఎం స్థాయిలో ఉన్న జగన్(Jagan) ను అనుచిత వ్యాఖ్యలు చేయడం సముచితం కాదని అన్నారు. ఎన్నికలపై అవగాహన లేని వ్యక్తి ప్రజలు అమ్ముడు పోతారనే కోణంలో ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు. అధికారం కోసం చంద్రబాబు, పవన్కల్యాణ్ అనేక అబద్దాలు ఆడుతున్నారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వస్తే స్వచ్ఛమైన సారాను అందిస్తామనడం పిఠాపురం నియోజకవర్గ ప్రజలను అవమానించినట్లేనని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో కూటమి మోసాలను గుర్తించి వైసీసీకి ఓటు వేయాలని కోరారు.