శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు మెక్కులుగా చెల్లించే తలనీలాల వేలం పాటలో ఓ భక్తుడు రూ.7,30,08000కు సొంతం చేసుకున్నారు. పరిపాలనా భవనంలో ఈవో లవన్న ఆధ్వర్యంలో కళ్యాణకట్ట తలనీలాల బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 12 మంది డిపాజిట్లను జమచేసి పాల్గొనగా 9 మంది మాత్రమే ఆసక్తిగా ముందుకుసాగారు.
అదే విధంగా ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లో నలుగురు మాత్రమే కోడ్ చేశారు. దేవస్థాన ప్రధాన విభాగాల అధికారులు సిబ్బంది సమక్షంలో బహిరంగ వేలం జరుగగా ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన యాదగిరి 7,30,08,000 రూపాయలకు ఖరారు చేసుకున్నారు. అనంతరం ఈప్రొక్యూర్మెంట్ టెండర్లను పరిశీలించగా రూ.30 లక్షలు తక్కువగా కోట్ చేయడంతో అధిక మెత్తం పాడుకున్న వారికే సంవత్సర కాలానికి తలనీలాల సేకరణకు అవకాశం ఇచ్చారు. గత ఏడాది రూ.3,85,20,000 కాగా ప్రస్తుతం రెట్టింపు ధరకు చేరుకోవడం హర్షనీయమని ఈవో లవన్న తెలిపారు.