అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లా ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లే ఇంతకుముందు పాట్నా హైకోర్టులో పనిచేశారు. అక్కడి నుండి న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలోని మొదటి కోర్టు హాల్లో జస్టిస్ అమానుల్లా ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి అరుప్ కుమార్ గోస్వామితోపాటు ఇతర న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ శ్రీరాం, పలువురు రిజిస్ట్రార్లు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.