అమరావతి : వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, పెట్టుబడులు కూడా రావని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల సభలో ఆయన మాట్లాడారు. జగన్ కారణంగా ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు ఐటీ కొలువుతలు దక్కాయని గుర్తు చేశారు. జగన్ హయాంలో విద్యావంతులకు వాలంటీర్ల ఉద్యోగాలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజానికంపై ఇష్టారాజ్యంగా పన్నులు పెంచుతున్న ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని తెలిపారు. రోడ్లపై గుంతలను పూడ్చలేని ముఖ్యమంత్రి ఇంకా అభివృద్ధి ఏం చేస్తారని అన్నారు. వైసీపీ పాలనలో ఎవరూ ఆనందంగా లేరని వెల్లడించారు.