అమరావతి : ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకరిపై ఒకరు ధీటుగా ప్రచారం చేసుకుంటుండగా ఈసీ (Election Commission) గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది . జనసేన (Janasena) పార్టీకి కేటాయించిన గాజు గ్లాస్ (Gaju Glass) గుర్తును ఏపీలోని పలు జిల్లాలో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని తప్పు పడుతూ జనసేన నాయకులు ఏపీ హైకోర్టు (High Court ) లో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు.
గాజు గ్లాసును ఇతరులకు కేటాయించవద్దని పిటిషన్లో కోర్టును కోరారు. పిటిషన్పై మంగళవారం విచారణ జరుగగా 24 గంటల్లో ఈసీ నిర్ణయం తీసుకుంటుందని ఈసీ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. దీంతో జనసేన పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేసింది. నెల్లూరు, విశాఖ, ఏలూరు, ప్రకాశం జిల్లాలో ముగ్గురేసి చొప్పున అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తును కేటాయించారు.