అమరావతి :ఏపీలోని అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు (Railwaykoduru) నియోజకవర్గ జనసేన (Janasena) అభ్యర్థిగా మరొకరి పేరును ప్రకటించారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawankalyan) తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇంతకు ముందు యనమల భాస్కర్ స్థానంలో అరవ శ్రీధర్ (Arava Sridhar) కు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో నివేదికలు, జిల్లా నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత ఈ మార్పు చేసినట్లు వివరించారు.
ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జనసేన రెండు ఎంపీ, 21 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తుంది. వీటిలో ఒకట్రెండు పెండింగ్ స్థానాలకు అధికారికంగా అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది.