రాజమండ్రి: జనసేన బహిరంగ సభకు అనుమతి లేదని రాజమండ్రి పోలీసు శాఖ స్పష్టం చేసింది. సభావేదిక మార్చుకోవాలని నిర్వాహకులకు తాము సూచించినట్లు రాజమండ్రి అడిషనల్ ఎస్పీ తెలిపారు. బాలాజీపేట సెంటర్లో సభ పెట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయని పోలీసులు తెలిపారు. సభకు అనుమతి ఇస్తే సుమారు 20 వేలమంది వచ్చే అవకాశం ఉందని, అందుకే ఈ సూచన చేశామని వెల్లడించారు.
హుకుంపేట-బాలాజీపేట రోడ్డులో జనసేన శ్రమదానం కార్యక్రమం నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అయితే పోలీసుల ప్రకటన తర్వాత పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.