కాకినాడ జిల్లా : తుని పర్యటనలో ఉన్న సీఎం జగన్.. ఓ తల్లి ఆవేదనను చూసి చలించిపోయాడు. జనం మధ్యలో ఉన్న ఆ తల్లిని పిలిచి బాలుడి సమస్యను అడిగి తెలుసుకుని ప్రభుత్వ పరంగా సాయం చేసేందుకు హామీ ఇచ్చాడు. తన వెంటే ఉన్న కాకినాడ కలెక్టర్ను పిలిచి బాలుడికి చికిత్సకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా పురమాయించాడు.
ఏపీ సీఎం జగన్ ఇవాళ కాకినాడ జిల్లాలోని తుని పట్టణంలో పర్యటించారు. కాన్వాయిలో వెళ్తుండగా ఇంతలో జనం మధ్యలో ఓ తల్లి తన కుమారుడిని పెకెత్తి సీఎం దృష్టిని ఆకర్శించే ప్రయత్నం చేసింది. బాలుడిని గమనించిన జగన్ వెంటనే తన కాన్వాయిని ఆపించాడు. జనం మధ్య నిలబడి ఉన్న ఆ బాలుడి తల్లిని పిలిచి బాలుడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశాడు. తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, చికిత్స చేయించే స్థామత లేనందున ఆదుకోవాలని శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన తనూజ వేడుకున్నది. ఆమె వినతికి చలించిపోయిన జగన్.. తన వెంట ఉన్న కాకినాడ కలెక్టర్ను పిలిచి బాలుడి చికిత్సకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించాడు. అప్పటికప్పుడే బాలుడికి చికిత్స అందేలా చేసిన సీఎం జగన్కు స్థానికులు అభినందించారు.