అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandra Babu) ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్( YS Jagan) పై విరుచుకు పడ్డారు. గుడివాడలో టీడీపీ (TDP) ఆధ్వర్యంలో నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఐదేళ్ల వైసీపీ పాలన(YCP Rule) లో జరిగిన అరాచకాలను, జగన్ ప్రభుత్వం పెంచిన పన్నుల వల్ల ప్రజలు ఎదుర్కొన్న బాధలను వివరించారు. జగన్ మీ బిడ్డ కాదు. రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డని అన్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. ప్రభుత్వ జీవోలు బయటకు రాకుండా దాచిపెట్టారని విమర్శించారు. అంబేద్కర్ (Ambedkar) రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసి తీరుతామని అన్నారు. వైసీపీని భూస్థాపితం చేయాల్సిన బాధత్య అందరిపై ఉందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా దేశానికి మహనీయులను అందించిందని గుర్తు చేశారు. టీడీపీ ఎవరికీ భయపడదని అన్నారు.
మరో రెండు నెలలు మాత్రమే వైసీపీ ఉంటుందని, ఆతరువాత కనుమరుగవుతుందని వివరించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని విమర్శించారు. బూతులు తిట్టే వారితో జాగ్రత్తగా ఉండాలని పరోక్షంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) ని ఉద్దేశించి వ్యాఖ్యనించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన గెలుపు అన్స్టాపబుల్ (Un-stoppble) అని పేర్కొన్నారు.