అమరావతి : సామాన్య భక్తులు దర్శనం సులువుగా కల్పించేందుకు వీఐపీలకు కల్పించే ప్రోటోకాల్ దర్శనా ల్లో పలు మార్పులు చేశారు. ఈనెల 5 నుంచి నూతన విధానం అమల్లోకి వస్తుందని శ్రీశైలం ఆలయ అధికారు లు వెల్లడించారు. రోజులో రెండు సార్లు మాత్రమే ప్రముఖులకు దర్శనాలు చేసుకునేందుకు ఏర్పాటు చేసిం ది. ఉదయం 5:30 నుంచి 6:15 గంటలకు, సాయంత్రం 7 నుంచి 7:30 గంటల వరకు మాత్రమే ప్రముఖులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ఆలయ ఈవో లస్మన్న తెలిపారు.
ఆలయా నికి విచ్చేసే ప్రముఖులు తమ పర్యటన రెండు రోజులు ముందు తెలుపాలని కోరారు. ప్రముఖుల దర్శన, ఆర్జితసేవ, సిఫారసు ఎస్.ఎం.ఎస్ పంపడాన్ని దేవస్థానం రద్దు చేసిందని, వసతి, దర్శన, ఆర్జితసేవ సిఫారసులకు ఆయన సూచించారు.