అమరావతి : ఆంధ్రప్రదేశ్లో హక్కుల గురించి ప్రశ్నించే వారందరినీ ప్రభుత్వం అడ్డుకుంటుందని టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్ ఆరోపించారు. పంటలు ఎండిపోతున్నాయని మొరపెట్టుకునేందుకు రోడ్డుపైకి వచ్చే రైతులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం విచారకరమని ఆయన అన్నారు.
హంద్రీనీవా నీరు విడుదల చేయాలని అనంతపురం జిల్లా ఉరవకొండ రహదారిపై రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆందోళనలో పాల్గొన్న పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతుంటే ఆందోళన చేసే హక్కు లేదా అని ప్రశ్నించారు. రైతులకు పోలీసులు నోటీసులు ఇచ్చి బెదిరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.