అమరావతి : పవిత్రమైన టీటీడీ ( TTD ) లో ఇంజనీరింగ్ పోస్టుల ( Engineering Post ) భర్తీలో పెద్ద ఎత్తున్న అక్రమాలు జరిగాయని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ( Karunakar Reddy ) ఆరోపించారు. ఒక్కో పోస్టును రూ. 30 నుంచి రూ.40 లక్షలకు అమ్ముకున్నారని శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ ( Inquiry ) జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
గతంలో కోర్టు నిలిపేసిన పోస్టులపై నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాంత వాసులకు ప్రత్యేక కేటాయింపులు జరపకపోవడంతో న్యాయ వివాదాలు తలెత్తే అవకాశం ఉండడంతో వైసీపీ హయాంలో నోటిఫికేషన్ను తాత్కాలికంగా నిలిపివేశామని పేర్కొన్నారు. ఇటీవల ఆ పోస్టుల భర్తీకి టీటీడీ చైర్మన్, ఇద్దరు సభ్యులు వాటిని అమ్ముకున్నారనే చర్చ జరుగుతుందని ఆరోపించారు. 2024-25లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించలేదని విమర్శించారు.