అమరావతి : ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో 11 మంది ఐపీఎస్(IPS )లకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2006 బ్యాచ్కు చెందిన డీఐజీ(DIG)లకు ఐజీ(IG) లుగా పదోన్నతి కల్పించింది. కొల్లి రఘురామరెడ్డి, త్రిపాఠి, అశోక్కుమార్, విజయ్కుమార్, హరికృష్ణ, ఎం. రవిప్రకాష్, రాజశేఖర్, కేవీ మోహన్రావు, రామకృష్ణకు ఐజీలుగా ప్రమోషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యుటేషన్లో ఉన్న రవికృష్ణ, జయలక్ష్మికి సైతం పదోన్నతి కల్పించింది .