అమరవాతి : ఆంధ్రప్రదేశ్లో పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)పై చర్చించేందుకు రావాలని ప్రభుత్వం మరోసారి ఈరోజు చర్చలకు ఆహ్వానించింది. మధ్యాహ్నాం 12 గంటలకు సచివాలయానికి రావాలని మంత్రుల కమిటీ పీఆర్సీ సాధన సమితి నాయకులకు ఆహ్వానం పంపింది. స్టీరింగ్ కమిటీలోని 20 మంది సభ్యులు చర్చలకు రావాలని సాధారణ పరిపాలనాశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ ఆహ్వానాన్ని పంపారు.
అయితే మంత్రుల కమిటీ ఉంచిన మూడు డిమాండ్లపై నిర్ణయం తీసుకుంటేనే చర్చలకు వెళ్తామని పీఆర్సీ సాధన సమితి నాయకులు స్పష్టం చేశారు. అసంబద్ద 11వ పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, అశుతోష్ మిశ్రా నివేదికను బహిర్గతం చేయాలని, జనవరి నెలకు పాత వేతనాన్ని ఇవ్వాలని యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే .