(Leather Park) తాడేపల్లి: ప్రకాశం జిల్లాలో త్వరలో అంతర్జాతీయ లెదర్ పార్క్ ఏర్పాటు కానున్నది. 500 ఎకరాల్లో నిర్మించే ఈ పార్క్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎల్ఐడీసీ) చైర్మన్ కాకుమాను రాజశేఖర్ వెల్లడించారు. ఏపీఎల్ఐడీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాదిగ సామాజికవర్గం అభివృద్ధికి కార్పొరేషన్ పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి ఎల్ఐడీసీ ఆస్తులను పరిశీలించి, మాదిగ సామాజికవర్గానికి ఆర్థిక ప్రయోజనం కల్పించేందుకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసినట్లు రాజశేఖర్ చెప్పారు. ఈ పర్యటన నివేదికను త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేస్తామని తెలిపారు. తగినన్ని నిధులు విడుదల ఇవ్వకుండా కార్పొరేషన్ను బలహీనపరిచేందుకు గత ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. ప్రస్తుత బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించిన అప్పటి ప్రభుత్వం రూ.40 కోట్లు విడుదల చేసి రూ.25 కోట్లు వెనక్కి తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. భావితరాలకు ఉపాధి కల్పించేందుకు అవసరమైన శిక్షణను అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. శిక్షణ కేంద్రాల కోసం కేంద్రం రూ.20.58 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. ప్రకాశం జిల్లా యడవల్లి, కృష్ణా జిల్లా జీ కొండూరు, చిత్తూరు జిల్లా తిరుపతి, విజయనగరం జిల్లా అడ్డపూసలలో రై.20 కోట్లతో శాశ్వత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని కచ్చితంగా తినాల్సిందే!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..