అమరావతి: అమరావతి అసైన్డ్ భూముల కేసులో టీడీపీకి చెందిన మాజీ మంత్రి నారాయణకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది . నారాయణ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, విదేశాల్లో చికిత్స చేయించు కునేందుకు మూడు నెలలు అతడికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని నారాయణ తరుఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోరారు. కిందికోర్టులో కూడా మిగతా నిందితులకు సెక్షన్లు వర్తించవని రిమాండ్ను తిరస్కరిం చిన అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ కేసులో నారాయణ కీలక నిందితుడని, అతడికి ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్ ఇవ్వకూడదని ప్రభుత్వ లాయర్వాదించారు. హైకోర్టులోనే మరో కేసులో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్ ఇచ్చిందని నారాయణ తరుఫు లాయర్ వాదించగా జడ్జిలు నారాయణకు మధ్యంతర బెయిల్ను మంజూరు చేశారు.
అమరావతి భూ సమీకరణలో పథకంలో భాగంగా ఎసైన్డ్ భూములకు చెందిన రైతులను నారాయణ ఆయన అను చరులు రైతులను బెదిరించి నిర్ణయించిన ధరలకే అమ్ముకునేలా చేశారని సీబీఐ కేసులు నమోదు చేసింది.