అమరావతి : ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు పీఎస్ వద్ద దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ హెడ్ కానిస్టేబుల్కు తీవ్రగాయాలు అయ్యాయి. దుకాణం నుంచి వస్తున్న మంటలను అదుపు చేస్తుండగా మంటలు ఎగిసిపడి గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో హెడ్ కానిస్టేబుల్కు గాయాలు అయ్యాయి. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.