అమరావతి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భవాని దీక్షల విరమణ సందర్భంగా ఆలయానికి రూ. 7.50 కోట్లు ఆదాయం వచ్చిందని ఈవో భ్రమరాంబ తెలిపారు. డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు భవాని దీక్షల విరమణ జరిగిందన్నారు. భక్తుల సౌకర్యార్ధం రూ. 100లు,రూ.300 లు, రూ. 500ల టికెట్లను అందుబాటులో ఉంచామని వివరించారు. ఐదు రోజుల పాటు నిర్వహించిన విరమణ సందర్భంగా 5 లక్షల 40 వేల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు.
15 లక్షల లడ్డులు అమ్ముడు అయ్యాయని వెల్లడించారు. వచ్చే ఏడాది దసరా, దీక్షలకు పర్మినేట్ హోమ గుండాలు ఏర్పాటు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా వచ్చే ఉత్సవాలకు ముందస్తుగా కొన్ని పనులు పూర్తి చేస్తామని తెలిపారు.