(Corona @ AP) అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 122 మందికి కరోనా వైరస్ సోకింది. ఇదే సమయంలో 103 మంది కోలుకున్నారు. కొవిడ్ వల్ల నిన్న విశాఖపట్నంలో ఒకరు మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తన బులెటిన్లో తెలిపింది. ఏపీలోకి ప్రవేశించిన కరోనా కొత్త వేరియంట్ కూడా మెల్లమెల్లగా వ్యాప్తి చెందుతున్నది. దాంతో కొవిడ్ ఆంక్షలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
ఇంతవరకు రాష్ట్రంలో 3,13,97,635 శాంపిల్స్ను పరీక్షించగా 20,77,608 మందికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. వీరిలో 20,61, 832 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,278 యాక్టివ్ కేసులున్నాయి. ఈ వైరస్ వల్ల ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 14,498 కు చేరుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. 15-18 ఏండ్ల టీనేజర్లకు కోవాగ్జిన్ వ్యాక్సినేషన్ వేస్తున్నారు. ఈ నెల 7వరకు వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగనున్నది.