Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఆర్యవైశ్య దివ్యసేవాధామం, మల్లికార్జున సత్ర సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన తెలంగాణ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం భవన ప్రారంభోత్సవం జరిగింది. సోమవారం సంఘం నిర్వాహకుల పర్యవేక్షణలో వేదపండితులు సురేష్ శర్మ అర్చక బృందం భవన ప్రోక్షణ చేసి గణపతిపూజ, పుణ్యావచనం, యాగశాల ప్రవేశం చేసి మహా సంకల్పం పఠించారు.
అనంతరం ప్రారంభోత్సవానికి విశిష్ట అతిధులుగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సమాచార కమీషనర్ శ్రీనివాసులు, ఆర్యవైశ్య మహాసంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్, పోతుల సురేష్, వాసవీ సత్ర సముదాయ అధ్యక్షులు దేవకీ వెంకటేశ్వర్లును శ్రీశైలం ఆర్యవైశ్య నిత్యాన్నసత్ర సంఘం అధ్యక్షులు మిడిదిడ్డి శ్యాంసుందర్తోపాటు సంఘం నిర్వాహకులు శాలువాతో సత్కరించి ఙ్ఞాపికలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీశైలం కమిటీ ప్రధాన కార్యదర్శి బలుస శ్రీరాములు, కోశాధికారి సోమిశెట్టి సాయికిషోర్, ఉపాధ్యక్షులు విసనకర్ర చంద్రకుమార్, కార్యదర్శులు పోల విష్ణు, పాల్వాయి శంకర్, సభ్యులు కొరివి చంద్రశేఖర్, నవీన్, ఉప్పల కిషన్, శ్రీధర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా వారం రోజులపాటు జరిగే ప్రారంభోత్సవ వేడుకలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి అతిధులు వస్తారని నిర్వాహకులు తెలిపారు.