అమరావతి : టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగల వంగలపూడి అనిత వైసీపీ మంత్రుల వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఏపీ మంత్రి రోజా నిన్న చంద్రబాబు, లోకేశ్ చీరెలు కట్టుకోవాలని చేసినా వ్యాఖ్యలకు అనిత కౌంటర్ ఇచ్చారు. ఏపీలో కనీసం మహిళకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. లేని దిశ చట్టాన్ని తీసుకువచ్చి మహిళలను అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో 8వందల మందికి పైగా మహిళలపై అఘాయిత్యాలు జరిగితే కనీసం నోరెత్తని సీఎంకు ఏం చీర పంపిస్తావని రోజాను ప్రశ్నించారు. జగన్ రోడ్డు వెంట వెళ్తుంటే ఇరువైపులా ఉండే దుకాణాలను మూసివేయిస్తున్నారని, రోడ్లపైకి ఎవరినీ రానీయడం లేదని ఆమె ఆరోపించారు. రెండువేల మంది పోలీసుల పహారాలో జగన్ బయటకు వస్తున్నారని అతడికి ఎలాంటి చీర పంపించాలని విమర్శించారు.