అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. కొవిడ్ నిధులు పక్కదారి పట్టించిన వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. మళ్లించిన నిధులను తిరిగి రెండువారాల్లో ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలో జమ చేయాలని జస్టిస్ ఎం.ఆర్షా ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది . పీడీ ఖాతాల్లోకి మళ్లించిన సుమారు. రూ. 1,100 కోట్లను ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలోకి జమ చేయాలని స్పష్టం చేసింది. కరోనా పరిహారం అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే నాలుగు వారాల్లోగా సమస్యను పరిష్కరించాలని వెల్లడించింది.
,