అమరావతి : సమీప అటవీ ప్రాంతం నుంచి తప్పివచ్చిన ఓ ఒంటరి ఏనుగు (Elephant Attack) గ్రామంపై పడి నానా బీభత్సం సృష్టించింది. ఏపీలోని చిత్తూరు(Chittoor) జిల్లా శాంతిపురం మండలం కోనేరు కుప్పం ఎస్.గొల్లపల్లి గ్రామాల్లో సంచరిస్తు భయాందోళనకు గురిచేసింది. రాళ్ల బూదుగూరు వద్ద కారును అడ్డుకుని ధ్వంసం చేసింది. అక్కడి నుంచి పంటపొలాలపై పడి పంటను నాశనం చేసింది. ఏనుగు బీభత్సం పై గ్రామస్థులు అటవీ, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతాలకు చేరుకున్న అధికారులు ఏనుగును అటవీ ప్రాంతంలోకి పంపేందుకు చర్యలు ప్రారంభించారు.