అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా మూడుపార్టీలు పనిచేస్తున్నాయని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ నాయకులు విషకూటమిలా ఏర్పడి ఏపీ సీఎంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో అధికార పీఠంపై ప్రజలే కూర్చున్నారన్న విషయం తెలుసుకుంటే మంచిదని వారికి సూచించారు.
టీడీపీలో శాశ్వత అధ్యక్షుడిగా చంద్రబాబు పేరు పెడితే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరుకోరని అన్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముని బలపరచాలని దేశ ప్రధాని మోదీ, అమిత్షా స్వయంగా ఫోన్ చేసి కోరారని తెలిపారు. రాష్ట్రంలో పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని విమర్శించారు. తానో వీకెండ్ లీడర్ అని విమర్శించారు.
అసెంబ్లీకి రానియకుండా జగన్ కుట్రపూరితంగా అడ్డుకుంటునారని పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పకొట్టారు. ప్రజలే ఆయనను అసెంబ్లీ గేట్ను తాకనీయడం లేదని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీచేసన పవన్ను అసెంబ్లీ గేట్ తాకకుండా ప్రజలే అడ్డుకున్నారని అన్నారు. ఇందులో జగన్కు ఏం సంబంధమని,ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్న జగనే పవన్కు ప్రత్యర్థిగా కనబడుతున్నారని ఆరోపించారు.