అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతుందని, రాష్ట్రంలో రివర్స్ పాలన కొనసాగుతుందని విమర్శించారు. మినీ మహానాడులో పాల్గొనేందుకు విచ్చేసిన సందర్భంగా అనకాపల్లిలో ఇవాళ చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా కన్యాకపరమేశ్వరీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు.
రాష్ట్రంలో దుర్గారపు పాలన నశించాలని అన్నారు. డ్రైవింగ్ సీటులో డ్రైవింగ్ రానివాళ్లు కూర్చుంటే ఎలా అని జగన్ పాలనపై మండిపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. వైసీపీ ప్రజావ్యతిరేక పాలనపై ప్రతి ఇంటి నుంచి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పన్నులు, ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై జగన్ పెను భారం మోపారని ఆరోపించారు.