విశాఖపట్నం : ఐఐఎం విశాఖపట్నం మరోసారి వంద శాతం సక్సెస్ రేటుతో ఎంబీఏ 2019-21 ప్లేస్మెంట్స్ను ముగించింది. మొట్టమొదటి వర్చువల్ ప్లేస్మెంట్స్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) విశాఖపట్నం తన 2019-21 బ్యాచ్కు తుది నియామకాలను పూర్తి చేసింది. కొవిడ్-19 ప్రభావం, ఈ సంవత్సరం మార్కెట్ మందగమనం ఉన్నప్పటికీ, రిక్రూటర్లు ఇనిస్టిట్యూట్ మీద నిరంతర విశ్వాసాన్ని కలిగి ఉన్నారు.
అమెజాన్, అముల్, ఆనంద్ రతి, ఏయూ బ్యాంక్, బ్లూస్టార్, బైజుస్, డెలాయిట్, ఇసాఫ్ బ్యాంక్, ఫాక్స్కాన్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్సీఎల్, ఐసీఐసీఐ లాంబార్డ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ఇన్మోబీ, కేపీఎంజీ, ముసిగ్మా, ఎమ్టీఆర్, ఎన్సీఆర్ కార్పొరేషన్, ఎస్బీఐ జీఐ, టీఏ డిజిటల్, టాటా ఏఐఏ, టాటా పవర్, టెక్ మహీంద్రా, టీవీఎస్ మోటార్స్, ఎస్ బ్యాంక్, జెట్వర్క్ కంపెనీలు ప్లేస్మెంట్లో పాల్గొన్నాయి.