అమరావతి : ఏపీ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను((IAS Tranfers) బదిలీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా అనంతరామును (Anantram)నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . ఆయనకు ఈడబ్ల్యూఎస్ సంక్షేమ విభాగం అదనపు బాధ్యతలను అప్పగించింది.
సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా జి. జయలక్ష్మిని నియమించగా రజత్ భార్గవ్ను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి తప్పించింది. ఆయనను ఎక్సైజ్(Excise) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించి క్రీడలు , సాంస్కృతిక శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది. మైనారిటీ శాఖ కార్యదర్శిగా ఇంతియాజ్కు పూర్తి అదనపు బాధ్యతలు, జి.లక్ష్మీషాకు గ్రామ, వార్డు సచివాలయ డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.