అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . రాష్ట్రానికి కొత్త సీఎస్గా జవహర్రెడ్డిని నియమించిన కొద్ది నిమిషాల తేడాలోనే రాష్ట్రంలోని మరికొందరిని బదిలీలు చేసింది .
ముఖ్యమంత్రి ప్రత్యేక సీఎస్గా పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్గా మధుసూదన్రెడ్డి, పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్ , ఆర్ అంబ్ బీ సెక్రటరీగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనర్గా రాహుల్ పాండేను, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాస్ను నియమించింది. నాలుగు రోజుల క్రితం నలుగురు ఐఏఎస్లను బదిలీలు చేసిన విషయం విధితమే.