అమరావతి : ఏపీలో జరుగబోయే ఎన్నికలకు పలు పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తుండగా వారికి ప్రత్యర్థులు ఎవరనేది ఆసక్తికర చర్చ మొదలయ్యింది. రాజకీయ, వ్యాపార, ముఖ్య నాయకుల పోటీపై సర్వత్రా ఆసక్తి ఉండడం సహజమే అయినప్పుటికీ వారిపై పోటీ చేసే సత్తా ఉన్న నాయకుడు ఎవరనేది మరింత ఆసక్తిని రేపుతుంది. తాజాగా జనసేన అధినేత పవన్కల్యాణ్( Pawan Kalyan ) ఎక్కడి నుంచి పోటీ చేస్తారోనన్న అంశం గత 15 రోజులుగా ఏపీలో హాట్ టాపిక్గా మారింది.
గురువారం తాను కాకినాడ జిల్లా పిఠాపురం (Pithapuram) నుంచి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించడంతో జనసేన శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనపై స్పందించిన సినీ నిర్మాత, దర్శకుడు ఆర్జీవీ (Ramgopal Varma) మాత్రం నేను కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ఎక్స్ ద్వారా ప్రకటించడం సంచలనం కలిగిస్తుంది. ఈ నిర్ణయం సడెన్గా తీసుకున్నదని ఆయన అందులో పేర్కొన్నారు. ఆర్జీవీ కాకినాడ జిల్లాకు చెందిన వ్యక్తి కానప్పటికీ వైసీపీ సానుభూతిపరుడిగా సంచలనం కోసమే ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించిన మొదటి, రెండు జాబితాల్లో మొత్తం128 పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో చంద్రబాబు, లోకేష్తో పాటు ఆ పార్టీకి చెందిన ప్రముఖులు పేర్లు ఉన్నాయి. అయితే జనసేనకు కేటాయించిన సీట్లలో పవన్కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎంపీగా పోటీ చేస్తారా అనే అంశం క్లారిటి లేకపోవడంతో అధికార వైసీపీకి చెందిన మంత్రులు, నాయకులు పవన్పై పలు విమర్శలు చేశారు.