తిరుపతి : తిరుమల శ్రీవారికి హైదరాబాద్కు చెందిన భక్తుడు ఎంఎస్ ప్రసాద్ స్వర్ణ నందక (బంగారు ఖడ్గం)ను బహూకరించనున్నాడు. రూ. కోటీ 8 లక్షలు వెచ్చించి 6.5 కిలోల ఈ ఖడ్గాన్ని ప్రత్యేకంగా తయారు చేయించాడు. సోమవారం స్వామివారికి ఈ స్వర్ణఖడ్గాన్ని ప్రసాద్ సమర్పించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు పేర్కొన్నారు.