అమరావతి : భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమె గొంతుకోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగిన దారుణ ఘటన వివరాలు. వరలక్ష్మి,(25), కనకరాజు(35) భార్య భర్తలు. గత కొన్ని రోజులుగా భార్యపై అనుమానం పెరగడంతో వీరిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంటుంది. ఇవాళ కూడా అనుమానంతో భార్య మెడ నరికి తను చేయి కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.
తీవ్రంగా గాయపడ్డ వరలక్ష్మిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.