తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతున్నది. భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులుదీరారు. దీంతో శ్రీవారి దర్శనం కోసం 36 గంటల సమయం పడుతున్నదని టీటీడీ ప్రకటించింది. రూ.300 ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నది.
క్యూలైన్లలో ఉన్న భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. సోమవారం కూడా సెలవుదినం కావడంతో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది.