Srisailam Project | శ్రీశైలం : ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయానికి ప్రస్తుతం 1,02,034 క్యాసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. జూరాల జలాశయం పంప్హౌస్ల నుంచి 34,286, స్పిల్వే నుంచి 35,820 క్యూసెక్కుల వరద వస్తుందని పేర్కొన్నారు. అలాగే, సుంకేశుల జలాశయం నుంచి 31,928 క్యూసెక్కుల వరద వస్తుంది. పరీవాహక ప్రాంతాల నుంచి మొత్తంగా 1,02,122 వస్తుందని పేర్కొన్నారు. కుడి, ఎడమగట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
విద్యుత్ ఉత్పత్తి ద్వారా సాగర్ వైపుగా 66,244 క్యూసెక్కులు విడుదలవుతుందని తెలిపారు. కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 30,929 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కులు నీరు విడుదలవుతోందని తెలిపారు. అలాగే, స్పిల్ నుంచి 53,764 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుందని తెలిపారు. రెండుగేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నట్లు వివరించారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.40 అడుగుల మేర నీరున్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 269.750 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 268.950 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు వివరించారు.