అమరావతి : ప్రకాశం జిల్లా పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh) లో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తుంది. మద్యం(Liquor), నగదు(Cash) అక్రమంగా తరలించే అవకాశం ఉండడంతో పోలీసులు టోల్ప్లాజాలతో పాటు శివారు ప్రాంతాల్లో ,పోలీసుల పికెటింగ్లను ఏర్పాటు చేసింది.
ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ప్లాజా వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయాలను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి గుంటూరుకు తరలిస్తుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత పది రోజులుగా ఏపీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కోట్లాది రూపాయలను పట్టుకున్నారు.