అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు విధానాల వల్ల రాష్ట్రానికి రావాల్సిన ప్రైవేట్ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ముఖ్యంగా విశాఖ యువతకు తలమానికంగా మారి వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన హెచ్ఎస్బీసీని మూసివేయడం అత్యంత బాధకరమని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఐటీ హబ్, ఆర్థిక రాజధానిగా మారిన విశాఖ ప్రస్తుతం వెలవెలబోతోందని ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రభుత్వం నియంత నిర్ణయాలు, బెదిరింపులకు భయపడి ఇప్పటికే అనేక కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.