తిరుపతి: కార్తీక మాసాన్ని పురస్కరించుకునితిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారిఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఏ ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం) శనివారం ప్రారంభమైంది. నవంబరు 21వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు చండీయాగం జరుగనున్నది.
ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఉదయం పూజ, నిత్యహోమం, చండీహోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, చండీపారాయణం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వహిస్తారు.