అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) 2024లో వచ్చే సాధారణ సెలవులపై ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ సెలవులతో పాటు పండుగలను కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం 20 రోజులు. సాధారణ సెలవులు, 17 రోజులు ఐచ్చిక సెలవులు(Optional Holidays) గా ప్రకటించింది . జనవరి 15న మకర సంక్రాంతి, 16న కనుమ పండుగ సెలవులను ప్రకటించింది. జనవరి 26న రిపబ్లిక్ డే, మార్చి 3న మహా శివరాత్రి, మార్చి 25న హోళీ, మార్చి 29న గుడ్ ఫ్రై డే సెలవులుంటాయని ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులో స్ఫష్టం చేశారు.
ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్రాం జయంతి, 9న ఉగాది, 11న రంజాన్, 17న శ్రీరామ నవమి, జూన్ 17న బక్రీద్ సెలవులుంటాయని తెలియజేసింది. జూలై 17న మొహర్రం, ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే, 26 శ్రీ కృష్ణాష్టమి, సెప్టెంబర్ 7న వినాయక చవితి సెలవులు, 16న ఈద్-ఉల్-ఉన్-నబీ పండుగల సందర్భంగా సెలవులను అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి, అక్టోబర్ 11న దుర్గాష్టమి, 31న దీపావళి, డిసెంబర్ 25న క్రిస్మస్ సెలవులు ఉంటాయని వెల్లడించింది . వీటితో పాటు మరో 17 ఐచ్ఛిక సెలవుల తేదీలను ప్రకటించింది .