తిరుపతి : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఈ సందర్భంగా శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు సీఎం జైరాం ఠాకూర్ కు వేదాశీర్వచనం చేశారు.
అనంతరం టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో జవహర్రెడ్డిలు శ్రీవారి తీర్థప్రసాదాలు, క్యాలెండర్, డైరీ, కాఫీ టేబుల్ బుక్ ఆయనకు అందజేశారు. ఈవో డ్రై ఫ్లవర్ టెక్నాలజీ, అగరబత్తీలు, పంచగవ్య ఉత్పత్తులు అందజేస్తూ ఆయనకు వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాసులు, డెప్యూటీ ఈవోలు రమేష్ బాబు, లోకనాధం తదితరులు పాల్గొన్నారు.