విజయవాడ: రేపటి నుంచి ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగనున్నాయి. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ఉత్తర్వులు వెలువరించింది. ఛార్జీలు ఏ మేరకు పెరుగుతున్నాయో ఒక ప్రకటనలో పేర్కొన్నది. పెరిగిన ఛార్జీలు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
డీజిల్ సెస్ పెంపుదల కారణంగా ఛార్జీలు పెంచక తప్పలేదని ఏపీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 డీజిల్ సెస్ విధిస్తున్నట్లు పేర్కొన్నది. పల్లెవెలుగు బస్సుల్లో 35-60 కి.మీ వరకు రూ.5 పెంచారు. 60-70 కి.మీ వరకు అదనంగా రూ.10 పెంపుదల ఉన్నది. ఛార్జీల పెంపుదలతో విద్యార్థుల బస్పాస్ ఛార్జీలు 20 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నది. కాగా, సిటీ బస్సుల్లో ఛార్జీల పెంపు లేదని తెలుస్తున్నది.