అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో హిజాబ్ వివాదం మొదలైంది. విజయవాడ లయోలా కళాశాలలో హిజాబ్ వేసుకొస్తే యాజమాన్యం రానివ్వడం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాలకు బుర్కాతో రావొద్దని కళాశాల యాజమాన్యం అభ్యంతరం చెప్పడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, ముస్లిం పెద్దలు అక్కడికి చేరుకుని నిరసనకు దిగారు.
తాము ఫస్టియర్ నుంచి బుర్కాలోనే కాలేజీకి వెళ్తున్నామని, ఐడీ కార్డులోనూ బుర్కాతోనే ఫొటో దిగామని విద్యార్థినులు పేర్కొన్నారు.