అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ‘చింతామణి’ నాటకం నిషేధంపై హైకోర్టులో ఇవాళ విచారణ కొనసాగింది . గత జనవరిలో ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరుఫున వాదించిన ఉమేశ్ చంద్ర అనే న్యాయవాది నాటకానికి సంబంధించిన పలు విషయాలను ప్రస్తావించారు. నాటకంలోని సుబ్బిశెట్టి పాత్ర ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేదిగా ఉందని మొత్తం నాటకాన్ని నిషేధించడం విచారకరమన్నారు.
ఇరువురి వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం నిషేధానికి సంబంధించిన అసలు ప్రతిని అందించాలని అప్పటివరకు నాలుగు వారాల పాటు విచారణను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది . 1920 నుంచి ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రముఖ తెలుగు నాటకం చింతామణి ని ప్రదర్శిస్తున్నారు.
అయితే ఒక సామాజిక వర్గానికి చెందిన వారు ప్రభుత్వంపై నిషేధానికి ఒత్తిళ్లు తీసుకురావడంతో గత ఫిబ్రవరిన రాష్ట్రవ్యాప్తంగా నాటకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . నిషేధాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ తిరుగుబాటు ఎంపీ రఘు రామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై కోర్టు విచారణ చేపట్టింది.