అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు జలాశయాలకు భారీగా నీరు వచ్చి చేరుతుంది. కర్నూలు జిల్లాలోని తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది . ఈ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 87,062 క్యూసెక్కుల నీరు ఎగువ భాగాన నుంచి వస్తుండగా 216 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్ల 1,623.90 అడుగులు ఉందని అధికారులు తెలిపారు.
అదేవిధంగా పల్నాడు జిల్లా పులిచింత ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది. ప్రసుత్తం ప్రాజెక్టుకు 3,320 క్యూసెక్కుల నీరు వస్తుండగా 400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గోదావరి నదిలో క్రమంగా వరద ప్రవహం పెరుగుతుంది. దవళేశ్వర బ్యారేజీ వద్ద 9.7 అడుగుల నీటిమట్టంతో వరద నీరు ప్రవహిస్తుంది.
కోనసీమ జిల్లా బూరుగులంక వద్ద వశిష్ట గోదావరి పాయలోకి వరదనీరు చేరింది. దీంతో బూరుగులంక వద్ద తాత్కాలిక రహదారి తెగిపోవడంతో నాలుగు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.