అమరావతి : కర్నూలు జిల్లాలోని సుంకేసుల ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగింది. సుంకేసుల 22 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 92,317, ఔట్ఫ్లో 90,222 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టు డ్యాం 4 గేట్లు ఎత్తి దిగువలకు నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 1,44,076 క్యూసెక్కుల నీరు వస్తుండగా 1,73,394 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 884.90 అడుగుల వరకు నీరు నిల్వ ఉందని వెల్లడించారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుందని వివరించారు.