అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు అంశంపై ప్రభుత్వం చేపడుతున్న సహాయ సహకారాలను వివరిస్తూ ఇటీవల చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వంపై, తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. నేను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని, ఎక్కడో ఓ చోట శాశ్వతంగా కనుమరుగు అవుతానని… తనను వ్యతిరేకించిన వైఎస్ కూడా కాలగర్భంలో కలిసి పోయాడని చంద్రబాబు అన్నారు. ఆయన సంస్కారానికి ఓ నమస్కారం అంటూ ఎద్దెవా చేశారు. ఏనాడైనా గతంలో చంద్రబాబు మానవత్వం చూపారా..? అని ప్రశించారు.
ఎవరూ ఊహించని విధంగా వరద ఉధృతికి ఏపీలో ప్రాజెక్టుల కట్టలు తెగిపోయాయి. అనూహ్యమైన వరద వల్ల ప్రాణ, ఆస్తినష్టాన్ని దాచి పెట్టలేదు.. వరద బాధితులను ఆదుకునే ప్రయత్నాలు చేశాం.. చెయ్యేరు దిగువ గ్రామాలు జల దిగ్బందంలో చిక్కుకున్నారు. నేను వెళ్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే నేనువెళ్లలేదు. గతంలో నెలల తరబడి అందని సహాయాన్ని వారం రోజుల్లో అందిస్తున్నామని వైఎస్ జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.