అంధ్రప్రదేశ్ : గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో కిడ్నాపైన బాలుడు క్షేమంగా తల్లి ఒడికి చేరాడు. పసి కందును ఎత్తుకెళ్లిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందే బాలుడిని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు
. వార్డుబాయ్గా పనిచేస్తున్న హేమ వర్ణుడు, పద్మ అనే మరో మహిళతో కలిసి చిన్నారిని ఎత్తుకెళ్లినట్లు సమాచారం. పద్మకు హెమవర్ణుడితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద చిన్నారిని క్షేమంగా తల్లి ఒడికి చేర్చడంతో పోలీసులకు అందరూ ధన్యవాదాలు తెలిపారు.