అమరావతి : శ్రీకాకుళం జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. జిల్లాలోని గార మండలం రామచంద్రపురం సర్పంచ్ వెంకటరమణ మూర్తిపై మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. మరురానగర్లోని ఆయన కార్యాలయానికి ఆదివారంపేటకు చెందిన ఓ మహిళ రాత్రి వెళ్లింది. ఆమెతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను వెంటతీసుకెళ్లింది. ఇద్దరు మాట్లాడుతుండగానే.. ఆమెతో వచ్చిన వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు.
తూటాలు వెంటరమణ పొట్టను రాసుకుంటూ వెళ్లడంతో ప్రమాదం తప్పినట్లయింది. గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. స్థటనా స్థలంలో రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ఆధ్వర్యంలో క్లూస్ టీం వేలిముద్రలు సేకరించారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.