Kodali Nani | ఏపీ రాజధాని అంశంపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పొలాల్లో రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు ఎలా చెబుతారని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప.. రాజధాని రైతులు ఏం త్యాగం చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో సీఎం జగన్కు తెలుసునని అన్నారు.
చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా ఏ రాజధానిలోనైనా 150 ఎకరాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయని.. మిగిలిన 99 శాతం ప్రైవేటు ఆస్తులుగా ఉంటాయని కొడాలని నాని అన్నారు. మరి 33 వేల ఎకరాలు తీసుకున్న చంద్రబాబు.. పిట్టలదొర కబుర్లు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలు నేరుగా పరిష్కారమయ్యే వ్యవస్థను క్రియేట్ చేసిన జగన్ గొప్పవాడా? గ్రాఫిక్స్తో దొంగ నాటకాలు ఆడింది చంద్రబాబు గొప్పవాడా అని ప్రశ్నించారు.