అమరావతి : ఏపీలోని బాపట్ల జిల్లాలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతానికి(Electrocution ) గురైన మనవరాలి (Granddaughter ) ని కాపాడేందుకు వెళ్లిన నాయనమ్మ సైతం ప్రమాదంలో మృతి చెందింది. చీరాల మండలం తోటవారిపాలెంలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
చిలకలూరిపేటలో నివాసముండే శ్రీనివాసి అనే మహిళ పుట్టింటి కోసం తోటవారిపాలెంకు వచ్చింది. సాయంత్రం ఆమె దండెం నుంచి దుస్తులు తీస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురయ్యింది . ఆమెను కాపాడబోయిన నాయనమ్మ ( Grandmother ) కోటమ్మ కూడా విద్యుదాఘాతానికి గురి కావడంతో వీరిద్దరిని కాపాడేందుకు యత్నించిన మరో మహిళకు గాయాలయ్యాయి.
మనవరాలు శ్రీనివాసి ఘటన స్థలంలోనే మృతి చెందగా కోటమ్మను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెల్లడించారు.