హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ పాలనను సరిదిద్దాల్సిన గవర్నర్ సీఎంకు వంతపాడుతున్నారని మండిపడ్డారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఏపీ గవర్నర్తో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని చెప్పారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఇక్కడ కళాశాలలో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.