అమరావతి : కాకినాడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని ఏపీ హోం మంత్రి తానేటి వనిత అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసుపై ఆమె స్పందించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అనంతబాబును అరెస్టు చేసి పేదలు, బడుగు, బలహీన వర్గాల పక్షాన ప్రభుత్వం నిలిచిందని తెలిపారు.
తప్పుచేసిన వారెవరైనా సరే ఉపేక్షించేది లేదన్న ఉద్దేశ్యంతో ఎమ్మెల్సీని అరెస్టు చేశామన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూస్తున్నాయని ఆమె అన్నారు.